పెద్దపల్లి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్రమ పైనాన్స్ నిర్వహిస్తున్న 49 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 లక్షల 50 వేల రూపాయాలు, 1235 ప్రాంసరి నోటీసులు, 347 ఏటీఎం కార్డులు, 1019 బ్లాంక్ చెక్కులు, 23 ల్యాడ్ పేపర్లు, 23 పాస్ బుక్కులు, 9 పట్టా పాస్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 70 మంది కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. గిరిగిరి, పైనాన్స్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm