హైదరాబాద్: కాకినాడలో సిద్దార్ధ హాస్పిటల్ లో మూడవ నెల గర్భిణి మృతి చెందింది. గత శనివారం తీవ్ర రక్తస్రావం కావడంతో రమాదేవి(21)ని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అబార్షన్ చేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ రోజు ఉదయం రమాదేవి మృతి చెందిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. దీంతో ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. ఎనస్థీషియా మోతాదుకు మించి ఇచ్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm