డుషాన్బ: తజకిస్తాన్ జైలులో జరిగిన అల్లర్లలో మొత్తం 32 మంది మృతిచెందినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మృతి చెందిన వారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. నిన్న జైలులో ఘర్షణ తలెత్తింది. వాహదత్ నగరంలో ఈ ఘటన జరిగింది. రాజధాని దుషాన్బేకు 25 కిలోమీటర్ల దూరంలో వాహదత్ ఉంది. సుమారు అరగంట పాటు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ఖైదీలకు చెందిన కుటుంబీకులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూర్టీ గార్డులను కూడా చంపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm