రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఆర్బీనగర్లో దారుణం జరిగింది. అక్షిత అను వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రాఘవేందర్రెడ్డి, అత్తమామలే హత్య చేశారని అక్షిత బంధువుల ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా అదనపు కట్నంకోసం అక్షితను భర్త, అత్తింటివారు వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కప్పాడ్ గ్రామానికి చెందిన అక్షితతో రెండేళ్ల క్రితం శంషాబాద్ ఆర్బీనగర్కు చెందిన రాఘవేందర్రెడ్డితో వివాహం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm