హైదరాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ కాలు విరిగిన ఘటన సోమవారం తొండూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం మేరకు.. తొండూరుమండలం మల్లెల ఘాట్లో ఆళ్లగడ్డ నుండి పులివెందులకు తవుడు లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దూదేకుల బుజేశ్వర్ కు కాలు విరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ ఆళ్లగడ్డ కు చెందిన ఎస్పి శెట్టి సుబ్రహ్మణ్యం కు చెందిందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm