హైదరాబాద్: కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి. నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారుల హెచ్చరిస్తున్నారు. ఇవాళ చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm