హైదరాబాద్: ఎగ్జిట్పోల్స్ అంచనాలు చాలాసార్లు తప్పాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. హాజీపూర్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫోన్లో మాట్లాడితే బాధితుల కడుపు నిండదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ జిమ్మిక్కులు మానుకోవాలని వీహెచ్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm