అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమాలపై ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్.ఆర్ కమ్మపల్లి, పులవర్తిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం కేంద్రాల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను సస్పెండ్ చేసింది. ఆ అధికారులపై శాఖా పరమైన చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఐదు పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన.. అనధికార వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఈసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఏడు ప్రాంతాల్లో రీ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చింది. దీంతో ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm