హైదరాబాద్:రక్తహీనతతో బాధపడుతున్న బాలింత చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండంగి రమ్య లతకు ఏప్రిల్ 21 న పురిటి నొప్పులు రావడంతో 108 ద్వారా పార్వతిపురం ఆసుపత్రికి తరలిస్తుండగా.. గరుగుబిల్లి మండలం ఎర్రగుడి సమీపంలో 108 వాహనం లోనే ఆడపిల్ల కు జన్మనిచ్చింది. పార్వతిపురం చేరేలోపే ఆ బిడ్డ మృతి చెందింది. 8.5 పాయింట్ల రక్తహీనతతో బాధపడుతున్న రమ్య లత ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, సోమవారం ఉదయం 108 వాహనంలో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమ్యలత మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm