హైదరాబాద్ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. చల్లా క్రాంతి, చల్లా రాజు అనే యువకులు అదే గ్రామానికి చెందిన, మేకల కాపరిగా జీవనం సాగిస్తున్న మంజుల అనే మహిళపై అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm