హైదరాబాద్: యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్లో సర్జికల్ దాడులు జరిగినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఆర్టీఐకి సమాధానం ఇస్తూ ఆర్మీ ఈ విషయాన్ని వ్యక్తం చేసింది. సర్జికల్ దాడుల గురించి నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ ఇవాళ మీడియాకు కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. సర్జికల్ దాడుల పట్ల రాజకీయ నేతల వ్యాఖ్యలపై స్పందించబోనన్నారు. రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే సమాధానం ఇస్తుందన్నారు. సర్జికల్ దాడుల గురించి తాను వెల్లడించింది కేవలం వాస్తవం మాత్రమే అని రణ్బీర్ సింగ్ తెలిపారు. భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడులకు సంబంధించిన అంశాలను కూడా ఆయన తెలియజేశారు. బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని గొప్ప విజయంగా కీర్తించారు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి మన విమానాలు ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే మరుసటి రోజు పాక్ తన యుద్ధ విమానాలతో సరిహద్దకు వచ్చినా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm