ఇస్లామాబాద్: పాకిస్థాన్ జట్టులోకి ఇద్దరు స్పీడ్ బౌలర్లు చేరారు. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ దారుణంగా ఓటమి పాలైంది. ఇప్పటి వరకు జరిగిన 4 వన్డేల్లో పాక్ ఓడిపోయింది. దీంతో చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ జట్టు కూర్పులో మార్పులు చేశాడు. అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ ఆమిర్, వాహబ్ రియాజ్లకు వరల్డ్కప్ కోసం ఎంపిక చేశాడు. వాస్తవానికి ఇప్పటికే 15 మంది సభ్యుల జాబితాను పాక్ రిలీజ్ చేసింది. కానీ ఇంగ్లండ్తో జరిగిన వన్డేల్లో పాక్ బౌలర్లు విపరీతంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్.. సీనియర్ బౌలర్లను మళ్లీ జట్టులోకి తీసుకున్నాడు. వరల్డ్కప్ కోసం ప్లేయర్ల జాబితాను మార్చుకోవడానికి మే 23వ తేదీ వరకు క్రికెట్ జట్లకు అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారమే పాక్ తన జట్టులో మార్పులు చేసింది.