న్యూఢిల్లీ: ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్యతో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కల్లో తేడా వస్తే, అప్పుడు అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎగ్జిట్పోల్స్పై ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈవీఎం ఓట్లతో పోలిస్తే వీవీప్యాట్ స్లిప్పులు సరితూగని సందర్భంలో ఎన్నికల సంఘం కొత్త నియమావళిని రూపొందించాలని డిమాండ్ చేశారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని 21 ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ను సుప్రీం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈవీఎంకు, వీవీప్యాట్ మధ్య ఒక్క ఓటు తేడా వచ్చినా.. ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని ఏచూరి తన ట్వీట్లో కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm