ఖమ్మం : జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన జిల్లా కమిటి సమావేశంలో బి.ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా నగర పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిసిన గ్రామాల్లో గ్రామీణ ఉపాధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm