భోపాల్: మధ్యప్రదేశ్ లోని మాందసోర్ జిల్లా లోని ఫతేపూర్ గ్రామస్తులు చిరుతను కొట్టి చంపారు. జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చిరుత గ్రామంలోకి వచ్చి ఐదుగురిపై దాడి చేసింది. దీంతో వారికి గాయలు అయ్యాయి. చిరుత గ్రామస్తుల మీద ఎక్కడ దాడి చేస్తుందోనని చిరుతను వారు కర్రలు, రాళ్లతో కొట్టి చంపినట్టు తెలిపారు.