హైదరాబాద్ : బోట్ కంపెనీ ఎయిర్డోప్స్ 411 పేరిట నూతన వైర్లెస్ ఇయర్బడ్స్ను భారత మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. వీటిలో 500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల మూడున్నర గంటల పాటు వీటిని నాన్స్టాప్గా ఉపయోగించుకోవచ్చు. అలాగే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. అందువల్ల 33 అడుగుల దూరం ఉన్నప్పటికీ ఈ బడ్స్ను ఉపయోగించుకోవచ్చు. వీటికి ఐపీఎక్స్4 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. ఈ వైర్లెస్ ఇయర్బడ్స్ రూ.2,999 ధరకు వినియోగదారులకు అమెజాన్ సైట్లో లభిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm