న్యూఢిల్లీ: తమ ఖాతాదారులకు ఎయిర్టెల్ గుడ్ న్యూస్ చెప్పింది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని తమ ఖాతాదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం ఉన్న ప్లాన్లపై అదనంగా 1000 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. నిజానికి మార్చి 31తోనే ఈ ఆఫర్ ముగియగా, దీనిని మరింతకాలం పొడిగిస్తున్నట్టు తెలిపింది. తాజా ఆఫర్ ప్రకారం.. ఎయిర్టెల్ ఖాతాదారులకు రూ.799 ప్లాన్లో 100 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 500 జీబీ డేటా బోనస్గా లభిస్తుంది. రూ.999 ప్లాన్లో 250 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 1000 జీబీ డేటా లభించనుంది. రూ.1,299, రూ.1999 ప్లాన్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 999 ఆపై ప్యాక్లపై డేటా రోలోవర్ సౌకర్యం కూడా ఉన్నట్టు ఎయిర్టెల్ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm