న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ నరేంద్ర మోడీ సారథ్యంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. ఈనెల 29న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ పదవీ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 290కి పైగా స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఎన్డీయే 348 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. విపక్ష కాంగ్రెస్ కేవలం 50 స్ధానాలకే పరిమితం కానుంది. ఇక వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రమాణ స్వీకారానికి ముందు ఈనెల 28న ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm