హైదరాబాద్ : శాసన సభ ఎన్నికలల్లో గులాబీ గాలికి గొప్పనాయకులు కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. కసీతో ఆ ఓటమి నుంచి తేరుకొని కొద్ది కాలంలోనే మళ్లీ విజయం సాధించడం ప్రజల్లో వారికున్న పట్టుకు నిదర్శనం. తెలంగాణలో తాజాగా వెలువడుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఇంట గెలవకపోయినా రచ్చ గెలిశారు.
రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ నాయకుల్లో ఫైర్బ్రాండ్ లీడర్గా గుర్తింపు పోందిన నేత రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుండి 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఓడినప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని,కేసీఆర్ ను విమర్శించడంలోను వెనుకకు తగ్గని నేత. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపుతెచ్చుకోగలిగారు. దీంతో కొడంగల్ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.
కోమటిరెడ్డి: నల్గొండ జిల్లాలో ఫైర్బ్రాండ్ లీడర్స్ గా గుర్తింపు ఉన్న నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా టీఆర్ఎస్ పై ఒంటికాలుతో దుసుకువెళ్లే నేత కోమటరెడ్డి. నల్గొండ ఎమ్మెల్యేగా ఓడినా లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
బండి సంజయ్: కరీంనగర్ ఎన్నికల సభలో కేసీఆర్ చేసి వ్యాఖ్యలే ఆ పార్టీ పాలిట శాపంగా మారాయి. హిందూ ఓటు బ్యాంక్ బండి సంజయ్ భారీ విజయానికి కారణం అయింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరపున కరీంనగర్ ఎమ్మెల్యేగా భారీ తేడాతో ఓటమి చవిచూసిన బండి సంజయ్ ఓడిన చోటే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ, తెరాస అభ్యర్థి వినోద్కుమార్పై సంజయ్ విజయం సాధించారు.