హైదరాబాద్ : నిజామాబాద్ లో టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమిపాలయ్యారు. కవితపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయ సాధించారు. కాగా, ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖయమని ఎన్నికల ప్రచార సమయంలో కవిత ధీమాగా చెప్పారు. ఇందుకు భిన్నంగా ప్రజల తీర్పు వెలువడటంతో ఆమె ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm