హైదరాబాద్ : నల్గొండ పార్లమెంటరీ స్థానంలో ఓట్ల లెక్కింపు ముగిసింది. 25,722 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుచారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 'నన్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. టీఆరెస్ పార్టీ అహంకారానికి కొంతమేరకు ఇది చెంప పెట్టులాంటి తీర్పు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటరీ ఫలితాల్లో తేడా స్పష్టం అయ్యింది. అసహ్యకరమైన, జుగుప్సాకర రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఎన్నికలపై పూర్తి స్థాయిలో శుక్రవారం గాంధీ భవలో స్పందిస్తా.' అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm