హైదరాబాద్ : జనసేన అధినేత పవన్కల్యాణ్కు ఏపీ ప్రజలు డబుల్ షాకిచ్చారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన్ను ఓడించారు. గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో జనసేనానికి చుక్కెదురైంది. గాజువాకలో పవన్పై వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి గెలుపొందారు. భీమవరంలో కూడా వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్పై విజయం సాధించారు. పవన్ ఓటమిపై కొందరు అభిమానులు బాధను వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తుంటే మరి కొందరు ఇది పవన్ కల్యాణ్ ఓటమి కాదు. ప్రజల ఓటమి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంపై జబర్థస్ట్ కమెడియన్, పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది.. ఓడిపోయింది పవన్ కాదు ప్రజలు అంటూ.. పవన్ ఓటమిపై ట్వీట్స్ చేశాడు. 'మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే' అంటూ హైపర్ ఆది ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm