హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. చివరి రౌండ్ వరకూ ఎంతో ఉత్కంఠగా సాగిన రాజోలు ఓట్ల కౌంటింగ్లో స్వల్ప మెజార్టీతో వరప్రసాద్ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందటంతో పాటు పార్టీకి ప్రాతినిధ్యం లభించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. జనసేనకు ఇది తొలి అడుగు మాత్రమే అని, భవిష్యత్లో మరింత బలపడుతామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్కు పార్టీ అధినేత పవన్ అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm