హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 301 స్ధానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 272 స్ధానాలు అవసరం కాగా, బీజేపీ సొంతంగానే మేజిక్ మార్క్ను దాటింది. 2014లో ఆ పార్టీ సాధించిన 282 స్ధానాలను మించి అత్యధిక స్ధానాలు కమలం ఖాతాలో పడటం ఖాయమైంది. ఇక ఎన్డీయే కూటమి 349 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. విపక్ష కాంగ్రెస్ కేవలం 50 స్ధానాలకు పరిమితమవనుండగా యూపీఏకు 91 స్ధానాలు దక్కనున్నాయి. ఇతరులు 103 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm