న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అల్ట్రాగియర్ సిరీస్లో రెండు కొత్త మానిటర్లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచంలోనే తొలి 1ఎంఎస్ నానో-ఐపీఎస్ విడియా జీ- మానిటర్లను ప్రవేశపెట్టారు. రెండు మోడల్స్ 27 అంగుళాల 27జీఎల్850, 37.5 అంగుళాల 38జీఎల్950జీ వేరియంట్లలో రెండు గేమింగ్ మానిటర్లను విడుదల చేశారు. ఎల్జీ అల్ట్రాగియర్ 38జీఎల్950జీ మానిటర్ రూ. 1,38,840, అల్ట్రాగియర్ 27జీఎల్850 మానిటర్ రూ. 34,710 ఉంటుంది. అమెరికాలో జూలై 1 నుంచి ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm