హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ప్రభుత్వోన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. కాగా, అతడి కోసం పది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. బుధవారం ఉదయం 9.30 నుంచి 12.45 వరకు హిందీ పరీక్ష నిర్వహించగా, జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలకు చెందిన క్రాంతి అనే విద్యార్థి ఒక్కడే పరీక్ష రాశాడు. ఐదుగురు పరీక్ష రాయాల్సి ఉండగా, నలుగురు గైర్హాజరయ్యారు. కాగా, ఆ ఒక్కడి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ఒక క్లర్క్, ఇన్విజిలేటర్, ఓ అటెండర్, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి (ఏఎన్ఎం), ఓ కానిస్టేబుల్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారి (నాయబ్ తాసిల్దార్) విధులు నిర్వహించగా, తనిఖీ కోసం కరీంనగర్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఇద్దరు పోలీస్ బందోబస్తుతో కారులో రావడం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm