హైదరాబాద్: అక్టోబర్ నెలలోగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ నిర్మాణరంగ అధికారులతో కలిసి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా దాన కిశోర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబర్ నెలలోగా దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ కాంక్రీట్ ఆధునిక టెక్నాలజీతో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. కేబుల్ బ్రిడ్జిలో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్తో పాటు అత్యాధునిక ఆకర్షణీయమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక రంగానికి దుర్గం చెరువు సరికొత్త ఆకర్షణగా నిలుస్తుందన్నారు. మొత్తం నాలుగు దశల్లో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. బ్రిడ్జికి ఇరువైపులా స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm