మధ్యప్రదేశ్ : ఈ నెల 16 న మధ్యాహ్నం 2 గంటలకు తన సజీవ సమాధికి అనుమతివ్వాలంటూ.. కలెక్టర్ కు వైరాగ్యానంద స్వామి దరఖాస్తు చేశారు. భోపాల్ లోక్సభ ఎన్నికల్లో దిగ్విజయ్ గెలవకపోతే, సజీవ సమాధి అవుతానని గతంలో వైరాగ్యానంద స్వామి చెప్పారు. డిగ్గీ ఓడిపోవడంతో.. వైరాగ్యానంద సజీవ సమాధి గురించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో తన నిర్ణయ అమలుకు అనుమతి కోరుతూ వైరాగ్యానంద స్వామి లేఖ రాశారు.
Mon Jan 19, 2015 06:51 pm