హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని శుక్రవారం డిమాండ్ చేశారు. గురువారం నుంచి వరుసగా జరుగుతున్న హత్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసు విభాగం ఇప్పటి వరకు జరగిన ఐదు హత్యల్లో అన్నీ వ్యక్తిగత కారణాలతో జరిగినవేనని.. అందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. చనిపోయిన వారిలో కొంతమందిపై ఇప్పటికే కేసులున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే నగరంలో నేరాల శాతం 10.5శాతం తగ్గిందని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm