హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా .. సుజిత్ దర్శకుడిగా భారీ బడ్జెట్ తో సాహో నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి నిన్ననే టీజర్ ను వదిలారు. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులలో చాలామంది ఈ టీజర్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అనుష్క చేరిపోయింది. సాహో టీజర్ చూశాను .. అద్భుతంగా వుంది. నాకు చాలా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ వారికీ .. ప్రభాస్ కి .. సుజీత్ కి .. మిగతా యూనిట్ సభ్యులకు అభినందనలు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ఇన్స్ టా గ్రామ్ అకౌంట్ ద్వారా వ్యక్తం చేశారు. అనుష్క .. ప్రభాస్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm