హైదరాబాద్: కొమ్రుంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వేంపల్లి ఫారెస్ట్ టింబర్ డిపోలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శనివారం మధ్యాహ్నం హైకోర్టు చీఫ్ జస్టీస్ దగ్గర హౌస్ మోషన్ పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. గత నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసులను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలు గురిచేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
కాసేపట్లో ఈ హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది. 67 మంది ఆదివాసులను వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని పౌర హక్కుల సంఘం ఆ పిటిషన్లో కోరింది. కాగా.. హౌస్ మోషన్ స్వీకరించిన హైకోర్టు సాయంత్రం 4:30 గంటలకు విచారణ జరుపనుంది. కోర్టు ఎలా తీర్పునిస్తుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 15,2019 04:24PM