హైదరాబాద్ : వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో తొలుత నిదానంగా ఆడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత జోరు పెంచింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో లంకపై ఒత్తిడి పెరిగింది. ఈ ఓపెనింగ్ జోడీని ఎలాగైనా విడగొట్టాలని చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ధనంజయ డిసిల్వా బౌలింగ్లో ఆరంభం నుంచి తడబడుతున్న వార్నర్(26) బౌల్డ్ అయ్యాడు. 53 బంతుల్లో ఫించ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వార్నర్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఖవాజ (10) 100 పరుగుల వద్ద డిసిల్వా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు స్కోరు 26 ఓవర్లకు 119/2గా ఉంది. క్రీజులో ఫించ్(69), స్మిత్ (9) ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm