హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మంజీర డైమండ్ టవర్స్లో గల స్విమ్మింగ్పూల్లో పడి పదేళ్ల బాలుడు మృతిచెందాడు. గేటెడ్ కమ్యూనిటీ సిబ్బంది నిర్లక్ష్యమే మృతికి కారణమని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈతకొలను నిర్వహణ సరిగా లేదని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm