తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రఖ్యాత రుయా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మౌలికవసతుల లేమికి బాబు అనే వ్యక్తి బలయ్యాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. జ్వరంతో జనరల్ వార్డులో చేరిన అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించేందుకు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆస్పత్రిలో సరిపడా స్ట్రెచర్లు లేవని, వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉండటంలేదని వైద్యులతో వాగ్వాదానికి దిగారు.మౌలిక వసతుల లేమిపై దృష్టిసారించిన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా ఈ రోజు ఉదయం రుయాలో తనిఖీలు చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm