హైదరాబాద్ : ఈ నెల 19న ఏపీకి రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకనున్నాయని స్పష్టంచేసింది. రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 19 నుంచి 24వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అలాగే ఈ నెల 18 వరకు ఎండల తీవ్రత కొనసాగతుందని స్పష్టం చేసింది. కోస్తా జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ప్రతీ జిల్లాలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటినట్లు పేర్కొంది. విజయనగరం జిల్లా కనిమెరకలో అత్యధికంగా 46.20 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm