న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ లేకుండానే పార్లమెంటులో ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం శుక్రవారం ముగిసింది. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో పరాజయం పొందడం వల్ల జేడీఎస్ అధినేత దేవెగౌడ ఈసారి పార్లమెంట్ సభ్యత్వం పొందలేదు. దీంతో మాజీ ప్రధానులు ఇద్దరూ లేకుండానే పార్లమెంటులో సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm