హైదరాబాద్: సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి నష్టం తప్పితే ఎలాంటి ప్రయోజనమూ లేదని, రాష్ర్టంలో ఈ విధానాన్ని రద్దు చేసి అగ్ర భాగాన నిలవాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవోస్ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కారం రవీందర్ రెడ్డి, మమత పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm