హైదరాబాద్ : ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న నీతిఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ నివేదికను సమర్పించారు. రెవెన్యూ లోటు, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నీతి ఆయోగ్ ముందుంచారు. విభజనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందని, 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఐటీ రంగం హైదరాబాద్లో కేంద్రీకృతం కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm