హైదరాబాద్: కెవిపి ఎస్ రాష్ట్ర ద్వితీయ మహాసభల లోగోను ప్రముఖ సామాజిక వేత్త ఆహ్వాన సంఘం ఛైర్మెన్ భరత్ భూషణ్ ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కెవిపి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో భరత్ భూషణ్ మాట్లాడుతూ దేశంలో హిందుత్వ శక్తులు రోజురోజుకు బలపడుతున్నాయిని అందుకు నిదర్శనమే దళితులపై జరిగుతున్న దాడులు అని అన్నారు. ఈ దాడులను తిప్పికోట్టాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలని అన్నారు. ఈ సభలో కెవిపి ఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు,టీపీఎస్ కె నాయకులు జి.రాములు, కె.హిమబిందు, భూపతి వెంకటేశ్వర్లు ,కెవిపి ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm