హైదరాబాద్ : ఐసీసీ వన్డే ప్రపంచకప్-2019ను వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా - అఫ్గానిస్థాన్ మ్యాచ్కు మరోసారి అంతరాయం కలిగించాడు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న అఫ్గాన్ 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. జట్టు స్కోరు 39 వద్ద హజ్రతుల్లా జజాయ్ (22)ను రబాడ పెవిలియన్ పంపించాడు. 56 వద్ద రెహ్మత్ షా (6)ను మోరిస్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నూర్ అలీ జర్దాన్(32), హష్మతుల్లా షాహిది (8) బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాచ్లో 20 ఓవర్లు ముగిసిన వెంటనే వర్షం మొదలైంది. చిరు జల్లులుగా మొదలైన వర్షం భారీగా మారింది. మరో రెండు గంటల పాటు వాన వస్తూ పోతూ దోబూచులాడుతుందని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm