హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా విడుదలైంది. 2019-20 విద్యా సంవత్సరానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉప కులపతి అశోక్ కుమార్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1500 సీట్లకు 34,217 దరఖాస్తులు అందాయి. దీంతో తొలి విడతలో 1404 సీట్లకు గాను ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. విద్యార్థుల్లో అత్యధికంగా బాలికలకు 68 శాతం, బాలురకు 32శాతం సీట్లు కేటాయించారు. తొలిసారి ఎన్నారై కోటాలో నైజీరియా విద్యార్థికి ఆర్జీయూకేటీలో సీటు దక్కింది. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 25, 26 తేదీల్లో క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm