హైదరాబాద్: రాష్ట్రంలో దొంగలు సంచరిస్తున్నారంటూ వస్తోన్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివి వస్తున్నాయని, తప్పుడు ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 24గంటలూ కార్యనిమగ్నులై ఉన్నారని.. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని డీజీపీ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm