కర్నూలు: జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలందరీకి గన్మెన్లను తొలగిస్తూ ఎస్పీ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్ కమిటీ ఆదేశాల మేరకు ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 మంది మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్ను ఉపసంహరించారు. ఇలా వారి దగ్గర ఉన్న 32 గన్మెన్ వెనక్కి పిలిపించారు. ఎస్ ఆర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఏయే నాయకుడికి గన్మెన్ అవసరమో కమిటీ సూచనల మేరకు ఈ గన్మెన్ తిరిగి కేటాయించనున్నారు. ఎస్పీ ఆదేశాలు అందుకున్న గన్మెన్ ఏఆర్ విభాగంలో రిపోర్టు చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm