హైదరాబాద్ : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలేజి రోడ్డులో గల బస్డిపో వద్ద గల పేపర్ప్లేట్లు తయారు చేయు కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారుగా 20వేల ఆస్తినష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయగా వారు సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో మిషనరీ కాలిపోకుండా కాపాడుకోగలిగామని కంపెనీ యజమాని కె.శివారెడ్డి తెలిపారు. అగ్నిమాపక కేంద్రం అధికారి కె.జాన్ ప్రకాష్, మరియు సియఫ్ చంద్రశేఖర్, డి.ఓ.పి నరసింహారావు, ఎఫ్.ఎమ్ నాగేశ్వరరావు, సిబ్బంది అన్వర్భాషా, శివయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm