ఖమ్మం : జిల్లాలోని ఏన్కూరు వద్ద ఎన్ఎస్పీ కాలువపై నిర్మించిన బ్రిడ్జిని మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు ఖమ్మం నుంచి మణుగూరు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm