గయ : రుతుపనాలు దేశంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎండలు మాత్రం తగ్గడం లేదు. నైరుతి మందగమనంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. గత శనివారం వరకు అక్కడ ఎండదెబ్బకు 60 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గయ సిటీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గయలో ఐపీసీ సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధారణంలో ఘర్షణలు, శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు జనం ఒకచోట గుమిగూడకుండా ఈ సెక్షన్ విధిస్తారు. అయితే గయలో మాత్రం జనాన్ని ఎండ నుంచి రక్షించేందుకు అమలుచేస్తున్నారు. 144 విధించడం వల్ల ప్రజలు బయటకురాకుండా ఉంటారని అలా వారిని ఎండదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని అధికారులు అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 17,2019 04:21PM