అమరావతి: పోలవరం ప్రాజెక్టు మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేస్తారా? అని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వేసిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో రూపొందించిన మేనిఫెస్టో విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. జ్యూడీషియల్ సిష్టం తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆయన అన్నారు. 45 రోజుల్లో జ్యూడీషియల్ కమిటీ వస్తుందని, అన్ని లోసుగులు బయటపడతాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm