హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. కొకైన సరఫరా చేస్తున్న టాంజానియా వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడు గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఎమ్మాన్యూల్ సూచన మేరకు నగరంలోని లంగర్హౌస్లో కొకైన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు టాంజానియాకు చెందిన జాన్ పాల్ ఎంబెలిగా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి కొకైన్తో పాటు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm