విజయనగరం : తోటపల్లి కాలువలో పడి మొండేటి లక్ష్మణరావు (30) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి పట్టణం గొల్లవీదికి చెందిన లక్ష్మణరావు బహిర్భుమికని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సమీపంలో గల తోటపల్లి కాలువ వద్దకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వెళ్లాడు. అయితే కాలువ గట్టు మీద నుండి కాలువలోనికి జారి పడడంతో నీటిలో మునిగి పోయాడు. దీంతో ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇది ఇలా ఉండగా మృతుడికి భార్య దేవి ఉంది. రెండేళ్ల క్రితం వీరిరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న భార్య దేవితో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm