న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎంపికయ్యారు. ఆరు నెలల పాటు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్షా అంతవరకూ కొనసాగుతారు. మోదీ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జేపీ నడ్డాను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నడ్డాకు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తదితరులు అభినందనలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm